internal-marks-6th-10th-class-cce-exams-reforms-implementation
పాఠశాల పరీక్షల్లో కీలక మార్పు*పదో తరగతి అంతర్గత మార్కుల మదింపులో మార్పు**6-9 వరకు ఓమ్మార్ షీట్ విధానం రద్దు*పాఠశాల విద్యాశాఖ పరీక్షల నిర్వహణలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. పదో తరగతి అంతర్గత మార్కుల విధానాన్ని మార్చారు. ఆరు నుంచి తొమ్మిది వరకు ఓమ్మార్ షీటుతో బహుళైచ్ఛిక ప్రశ్నలతో నిర్వహించే సమ్మెటివ్-1 పరీక్షల విధానంలోనూ మార్పులు తెచ్చారు. పదో తరగతి అంతర్గత మార్కుల్లో కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ఈ మార్పులను తీసుకొచ్చింది.**పదోతరగతిలో అంతర్గత మార్కుల లెక్కింపు ఇలా..**పదో తరగతిలో అంతర్గత మార్కులు 20% ఉంటాయి. వీటి మదింపులో ప్రభుత్వం మార్పులు చేసింది ఇప్పటివరకు నాలుగు ఫార్మెటివ్లు(50శ్రీ4), సమ్మెటివ్-1 (80మార్కులు) కలిపి మొత్తం 280 మార్కులను 20%కి కుదించి అంతర్గత మార్కులు కేటాయిస్తున్నారు. కొత్త విధానం ప్రకారం నాలుగు ఫార్మెటివ్లు 200మార్కులను 10శాతానికి కుదిస్తారు. మిగతా 10శాతం మార్కులను సమ్మెటివ్-1 ఆధారంగా కేటాయిస్తారు.**సమ్మెటివ్-1ను రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి పరీక్షగా నిర్వహిస్తారు. పరీక్ష పత్రాన్ని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి రూపొందిస్తుంది. ప్రభుత్వ పరీక్షల విభాగం ముద్రించి సరఫరా చేస్తుంది. సమ్మెటివ్-2ను పదో తరగతికి ప్రీఫైనల్గా నిర్వహిస్తారు*.ఆరు నుంచి తొమ్మిది వరకు..*⬛ *గత విద్యా సంవత్సరంలో సమ్మెటివ్ పరీక్షలను రెండుకు కుదించిన పాఠశాల విద్యాశాఖ 8,9 తరగతులకు ఓమ్మార్ షీటుతో బహుళైచ్ఛిక ప్రశ్నలతో పరీక్షలు నిర్వహించింది. ఈ ఏడాది ఈ విధానాన్ని 6,7తరగతులకు కూడా అమలు చేయనున్నట్లు గతేడాది జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆ ఉత్తర్వులకు ఇప్పుడు సవరణ తీసుకొచ్చింది. సమ్మెటివ్-1ను నవంబరు మొదటి లేదా రెండో వారంలో నిర్వహిస్తారు. సమ్మెటివ్-2ను మార్చి లేదా ఏప్రిల్లో నిర్వహిస్తారు.*⬛ *6నుంచి 9వ తరగతి వరకు ఓమ్మార్షీటుతో నిర్వహించే విధానాన్ని రద్దు చేశారు. పాత విధానంలోనే వివరణాత్మక (డిస్క్రిప్టివ్) పద్ధతి, బహుళైచ్ఛిక విధానంలో ప్రశ్నలు ఇస్తారు. బిట్ పేపర్ ఉంటుంది. సమ్మెటివ్-2 సంవత్సరం పరీక్షగా ఉంటుంది. సమ్మెటివ్1, 2 పరీక్షల నిర్వహణ బాధ్యతలను జిల్లా విద్యాధికారులకు అప్పగించారు.* |
|
|