10th-class-online-classes-digital-classes-ap-education-department-announced
ఏపీ టెన్త్ విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేసేలా.. ‘డిజిటల్ బోధన’
టెన్త్ విద్యార్థులు లాక్డౌన్ కాలంలో పరీక్షలకు సిద్ధం చేసేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ అనేక ఏర్పాట్లు చేసింది.
తాజాగా రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ద్వారా టెన్త్ పాఠ్యాంశాలను డిజటల్ కంటెంట్లో అందించే ఏర్పాట్లు చేసింది. ‘ఈ-కంటెంట్ ఎట్ యువర్ ఫింగర్ టిప్స్’ పేరిట సబ్జెక్టుల వారీగా పాఠ్యాంశాలను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది.
-
విద్యార్థులు ఆండ్రాయిడ్ ఫోన్ లేదా ల్యాప్టాప్, కంప్యూటర్లలో ఈ-కంటెంట్ ద్వారా సులభంగా నేర్చుకునేలా ఎస్సీఈఆర్టీ పాఠ్యాంశాలను రూపొందించింది. వీటిని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ (పీపీటీ) రూపంలో దీక్షా యాప్కు లింక్ చేసింది.
-
తెలుగు, హిందీ, ఇంగ్లిష్, ఉర్దూ లాంగ్వేజెస్తోపాటు ఇంగ్లిష్, తెలుగు మీడియంలలో మేథ్స్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్ సబ్జెక్టులలో పాఠ్యాంశాలను రూపొందించింది.
-
అన్ని పాఠ్యాంశాలను సబ్జెక్ట్ నిపుణులతో వీడియోల ద్వారా బోధన ఉండేలా సిద్ధం చేశారు.
-
ఇవేకాకుండా విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండే కొన్ని వెబ్పోర్టళ్లను కూడా ఎస్సీఈఆర్టీ డిజిటల్ ఎడ్యుకేషన్ విభాగం అందుబాటులోకి తెచ్చింది.
Digital Infrastructure for Knowledge Sharing (DIKSHA)
-
వీటిని క్లిక్ చేయడం ద్వారా కూడా విద్యార్థులు వివిధ అంశాలను నేర్చుకునేలా డిజిటల్ కంటెంట్ను పొందవచ్చు.
వెబ్పోర్టల్స్ ఇవీ:
e-Contents suggested by MHRD
CBSE Question bank for practice Class X
Online Learning App For CBSE & State Board