ఉచ్ఛప్రక్రముల్ = రోళ్ళవద్ద మిగిలిన బియ్యంతో జీవనం గడుపువారైన
తాపసుల్ = మునులు (తపస్సు చేసుకొనేవారు)
నీ కంటెన్ = నీ కన్నా
మతిహీనులే = తెలివితక్కువ వారా?
2. ఈ కింది పద్యాలలో ఒకదానిని పాదభంగం లేకుండా పూరించి, భావాన్ని రాయండి. 1×4=4
అ) అనల జ్యోతుల నీ పతివ్రతల …………………………
…………………………………. దుశ్చారిత్రముల్ సాగునే
(లేదా)
తనదేశంబు స్వభాష …………………………………….
………………………………………… భక్త చింతామణీ!
ఆ) కింది పరిచిత గద్య భాగాన్ని చదవండి. ఇచ్చిన నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాయండి. 4×1=4
కొత్త శతాబ్దంలో స్త్రీలందరం కలిసి చేసుకునే ఉత్సవంగా ఈ పుస్తకాన్ని తీసుకురావాలనుకున్నాం. ఫోటోలు ప్రచు రించాలనే నిర్ణయం చాలా ఆలోచించే తీసుకున్నాం. వ్యక్తులను చూస్తూ, వారి గురించి తెలుసుకోవటానికీ, ముఖమైనా తెలియని వ్యక్తుల గురించి చదవటానికి ఈ తరం వారు చూపే ఆసక్తిలో తేడా ఉంటుంది. ఈ తరం యువతకు గత చరిత్రను పరిచయం చేసేటప్పుడు వారి మనసుపై ముద్ర వేయటానికి ఫోటోలు అవసరమని పించింది. ఆ రకంగా వాళ్ళ జ్ఞాపకాలు మనలో ఎక్కువ కాలం ఉంటాయని మా ఉద్దేశం. వంద సంవత్సరాలుగా స్త్రీలు చేసిన పోరాటాలను గుర్తు చేసుకుంటూ జరుపుకునే విజయోత్సవంగా ఈ పుస్తకం నిలబడుతుందనుకున్నాం.
ప్రశ్నలు :
3) కొత్త శతాబ్దంలో ఏమి తీసుకురావాలనుకున్నారు?
4) పై పేరాలో ‘ఈ పుస్తకం’ అంటే ఏది?
5) ఫోటోలు ఎందుకు ప్రచురించాలనుకున్నారు?
6) పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి?
తే||గీ|| ఓ మునీశ్వర! వినవయ్య యున్న యూరుఁ
గన్నతల్లియు నొక్క రూపన్న రీతి
యటు విశేషించి శివుని యర్ధాంగలక్ష్మి
కాశి; యివ్వీటి మీఁద నాగ్రహము దగునె?
7) పై పద్యంలో మునీశ్వరుడు అంటే ఎవరు?
8) శివుని అర్థాంగ లక్ష్మి అని దేనికి పేరు?
9) పై పద్యంలో గసడద వాదేశసంధి పదం ఉంది. దాన్ని గుర్తించి రాయండి?
10) పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
*II. వ్యక్తీకరణ – సృజనాత్మకత 7 × 2 = 14*
అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి?
11. కవి వెన్నెలను వర్ణించడానికి ఏయే అంశాలను ఎన్నుకొన్నాడు?
12. సముద్ర లంఘనానికి ముందు హనుమంతుడు చేసిన చేష్టల ఆంతర్యం ఏమైయుంటుంది?
13. ఆచార్య నాగార్జునిని గురించి మీకు తెలిసిన విషయాలు రాయండి?
14. చిత్రగ్రీవాన్ని గురించి మీకు ఆశ్చర్యం కలిగించిన విషయాలు రాయండి?
15. ”పల్లెటూళ్ళు ప్రశాంత జీవన సౌఖ్యానికి పుట్టిల్లు” అని చెప్పిన జానపదుని జాబు కవిని గురించి రాయండి?
16. గోరంత దీపాలు పాఠ్యభాగ నేపథ్యాన్ని వివరించండి?
17. ‘ప్రబంధం’ ప్రక్రియను పరిచయం చేయండి?
ఆ) కింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో సమాధానం రాయండి? 2×5=10
18. మాతృభావన పాఠం ఆధారంగా శివాజీ వ్యక్తిత్వాన్ని విశ్లేషిం చండి?
( లేదా )
”కోపం మనిషి విచక్షణను నశింప జేస్తుంది’ అనే అంశాన్ని బిక్ష పాఠం ఆధారంగా నిరూపించండి.
19. ‘పల్లెటూళ్ళు ప్రశాంత జీవన సౌఖ్యానికి పుట్టిల్లు’ దీన్ని సమర్ధిస్తూ సమాధానం రాయండి.
( లేదా )
గోరంత దీపాలు కథానికి లోని వృద్ధుని పాత్ర స్వభావాన్ని, గొప్పదనాన్ని సొంత మాటల్లో రాయండి?
*III. భాషాంశాలు 12 మార్కులు*
20. ”అభినుతేందు చంద్రి కాంభోధియఖిలంబు
నీట నిట్టలముగ నిట్టవొడిచె’ – ఈ వాక్యంలోని అలంకారాన్ని గుర్తించి అలంకార లక్షణం రాయండి.
జవాబు : ఈ వాక్యంలోని అలంకారం – రూపకాలంకారం.
లక్షణం : ఉపమానోపమేయాలకు అభేదం చెప్పిన రూప కాలంకారం అంటారు.
21. ఈ కింది పద్యపాదాలలో ఒకదానిని గణవిభజన చేసి లక్ష్య లక్షణ సమన్వయం చేయండి.
నీకంటెన్ మతిహీనులే కటకటా! నీ వార ముష్టింపచుల్
జవాబు :
నీకంటెన్ – మ UUU
మతిహీ – స IIU
నులేక – జ IUI
టకటా! – స IIU
నీవార – త UUI
ముష్టింప – త UUI
చుల్ – గ U
– పై పద్యపాదంలో మ, స, జ, స, త, త, గ అనే గణాలు వచ్చాయి. ఇది శార్ధూలం.
– ఒకటవ అక్షరానికి, 13వ అక్షరానికి యతిమైత్రి చెల్లింది. నీ – నీ
– ఇది వృత్తజాతి పద్యం. ఇందులో నాలుగు పాదా లుంటాయి.
– ప్రాస నియమం ఉంటుంది.
(లేదా)
గాద్పువేల్పుపట్టి గట్టెక్కి యుక్కున
జూచె సూటి నేటి జోటి మగని
(మొదటి పాదం )
గాడ్పు – హ UI
వేల్పు – హ UI
పట్టి – హ UI
గట్టెక్కి – త UUI
యుక్కున – భ UII
(రెండవ పాదం )
జూచె – హ UI
సూటి – హ UI
నేటి – హ UI
జోటి – హ UI
మగని – వ III
– పై పద్యపాదాలలో మొదటి పాదంలో 3 సూర్య గణాలు, 2 ఇంద్రగణాలు, రెండవ పాదంలో ఐదూ సూర్యగణాలే ఉన్నాయి కాబట్టి ఇది ఆటవెలది పద్యం.
– ఇది ఉపజాతి పద్యం. దీనికి 4 పాదాలుంటాయి.
– ఒకటవ గణం మొదటి అక్షరానికి నాలుగవ గణం మొదటి అక్షరానికి యతి మైత్రి చెల్లింది. గా-గ
One comment
Pingback: 10th-Class-public-exams-March-2020-model-papers-all-subjects