ఈ పరీక్షలు 24న ప్రారంభమై జనవరి 4వ తేదీతో ముగియనున్నాయి.
మొత్తం 7,902 పోస్టులకు 6,08,159 అభ్యర్థులు దరఖాస్తుచేసుకున్న విషయం తెలిసిందే. అత్యల్పంగా ఎస్ఏ ఒడియాకుముగ్గురు, కన్నడ భాషాపండిత పోస్టులకు నలుగురు అభ్యర్థులు దరఖాస్తు చేశారు.
జనవరి 18 నుంచి ఎస్జీటీ
రెండో దశలో సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ) పరీక్షలు జనవరి 18 నుంచి 30వ తేదీ వరకు జరగనున్నాయి.
ఈ పరీక్షలకు మొత్తం 3,46,053 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఆన్లైన్ పరీక్షలను రెండు సెషన్స్లో నిర్వహించనున్నారు.