రెండు నెలల తర్వాత రీడింగ్ తీసినా నెలవారీగానే బిల్లింగ్
రెండు నెలలదీ కలిపి… శ్లాబ్ పెంచారనేది అపోహే
లాక్డౌన్తో గృహ వినియోగం పెరిగింది
విద్యుత్ బిల్లుల తప్పుడు ప్రచారంపై విద్యుత్ శాఖ వివరణ
రాష్ట్రంలో విద్యుత్ బిల్లులు పెరిగాయంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, అదంతా అపోహేనని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి పేర్కొన్నారు.
రెండు నెలలకూ కలిపి రీడింగ్ తీయడం వల్ల శ్లాబు రేట్లు పెరిగి, ఎక్కువ బిల్లులు వచ్చాయన్నది వదంతులేనన్నారు.