ap-rgukt-admissions-6-year-integrated-b-tech-programme-2019-20

ap-rgukt-admissions-6-year-integrated-b-tech-programme-2019-20

*ట్రిపుల్‌ఐటీ ప్రవేశాలకు పచ్చజెండా*

*♦13 నుంచే ప్రారంభమైన దరఖాస్తులు* 

*♦ఆగస్టు 8 నుంచి తరగతులు మొదలు*

ఎట్టకేలకు రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయ పరిధిలోని

నూజివీడు,

ఇడుపులపాయ,

శ్రీకాకుళం,

ఒంగోలు

ట్రిపుల్‌ఐటీ ప్రవేశాలకు బుధవారం పచ్చ జెండా ఊపారు.

సార్వత్రిక ఎన్నికలు, కొత్త ప్రభుత్వ ఏర్పాటు కారణంగా ప్రవేశాలపై నెలకొన్న సందిగ్ధతకు తెరదించుతూ ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.

ఈ నాలుగు ట్రిపుల్‌ఐటీలకు నూజివీడు క్యాంపస్‌లోనే కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు.

విశ్వవిద్యాలయం జారీచేసిన నోటిఫికేషన్‌ ప్రకారం..* 

* ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ : 13-6-2019 నుంచి 

* దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు : 1-7-2019 

* వికలాంగులు, సైనిక సంతతి, ఎన్‌సీసీ, క్రీడా విభాగాల ధ్రువీకరణ పత్రాలు ఆన్‌లైన్‌ ద్వారా పంపడానికి

ఆఖరు తేదీ: 4-7-2019 

* ధ్రువపత్రాలు పంపాల్సిన చిరునామా :

ది కన్వీనరు,

యూజీ అడ్మిషన్స్‌-2019,

రూమ్‌ నంబర్‌: 87, 13 బిల్డింగ్‌,

ఆర్జీయూకేటీ, నూజివీడు,

కృష్ణాజిల్లా-521202.

స్పీడ్‌/రిజిస్టర్డ్‌ పోస్ట్‌ ద్వారా పంపాలి.

కవర్‌పై యూజీ అడ్మిషన్స్‌-2019,

ఆర్జీయూకేటీ ఏపీ అని రాయాలి. 

* స్పెషల్‌ కేటగిరి(పీహెచ్‌, క్యాప్‌, ఎన్‌సీసీ, స్పోర్ట్స్‌) ధ్రువీకరణ పత్రాల పరిశీలన తేదీలు:

క్యాప్‌ : 19-7-2019 

స్పోర్ట్స్‌ : 19-7-2019, 20-7-2019, 22-7-2019 

పీహెచ్‌ : 20-7-2019 

ఎన్‌సీసీ : 22-7-2019, 23-7-2019.

 స్పెషల్‌ కేటగిరి మినహా సాధారణ అభ్యర్థుల ఎంపిక జాబితా ప్రకటన :

23-7-2019 

* నూజివీడు క్యాంపస్‌లో రాష్ట్ర, రాష్ట్రేతర, ఇతర దేశాల అభ్యర్థుల కౌన్సెలింగ్‌ :

5-8-2019, 6-8-2019. 

* నూజివీడు క్యాంపస్‌లో రాష్ట్ర, రాష్ట్రేతర, ఇతర దేశాల, శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీ అభ్యర్థుల కౌన్సెలింగ్‌ : 7-8-2019, 8-8-2019 

* ఇడుపులపాయ క్యాంపస్‌లో రాష్ట్ర, రాష్ట్రేతర, ఇతర దేశాల అభ్యర్థుల కౌన్సెలింగ్‌ తేదీ :

5-8-2019,    6-8-2019 

* ఇడుపులపాయ క్యాంపస్‌లో ఒంగోలు ట్రిపుల్‌ఐటీ అభ్యర్థుల కౌన్సెలింగ్‌ :

7-8-2019, 8-8-2019 

* అన్ని క్యాంపస్‌లలో తరగతుల ప్రారంభం తేదీ : 

 9-8-2019.

ప్రవేశ విధానం*

*పదో తరగతిలో జీపీఏ ఆధారంగానే ప్రవేశాలు ఉంటాయి.

ప్రభుత్వం నాన్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలు, ఇతర జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వెనుకబాటు సూచి కింద 0.4 పాయింట్లను వచ్చిన పదోతరగతి గ్రేడ్‌కు జత కలిపి ప్రవేశాల్లో ప్రాధాన్యం కల్పిస్తారు.

సీట్ల కేటా యింపు సమయంలో సమాన గ్రేడ్‌ పాయింట్లు ఉన్నట్టయితే మొ దట గణితం తర్వాత జనరల్‌ సైన్స్‌, ఆ తర్వాత ఇంగ్లీష్‌, తర్వాత సోషల్‌, ఆ తర్వాత ఫస్ట్‌ లాంగ్వేజ్‌లో సాధించిన మార్కులను పరిగణలోకి తీసుకుంటారు.

అయినా సమానమైతే పుట్టిన తేదీ ప్రకారం పెద్ద వయస్సు ఉన్న వారికి అవకాశం ఇస్తారు.

 * ఫీజులు ఇలా..*

*ప్రవేశం పొందిన విద్యార్థులు ఐఐఐటీలో ఆరు సంవత్సరాలు చదవాల్సి ఉంటుంది.

అభ్యర్థులు మొదటి రెండేళ్ల వార్షిక రుసుంగా రూ. 36వేలు ఆ తర్వాత మిగిలిన నాలుగు సంవత్సరాలకుగానూ వార్షిక రుసుం రూ. 40 వేలు చెల్లించాల్సి ఉంటుంది.

* ఉచిత సౌకర్యాలు*

*పేద విద్యార్థులు ఎవరైతే ఫీజు రీయంబర్స్‌ మెంట్‌ పథకానికి అర్హులో వారికి విద్య, హాస్టల్‌తో పాటు అన్ని సౌకర్యాలు ఉచితంగా ప్రభుత్వమే కల్పిస్తుంది.

 * కౌన్సెలింగ్‌లో సమర్పించాల్సిన పత్రాలు*

*దరఖాస్తు చేసుకున్న సమయంలో ఏవైతే సమర్పించారో కౌన్సిలింగ్‌లో అవి సమర్పించాల్సి ఉంటుంది.కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు, స్టడీ, కాండక్ట్‌, టీసీ, మెమోతో పాటు రిజర్వేషన్‌ వర్తించే పత్రాలేమైనా ఉంటే అన్నింటినీ సమర్పించాలి.

 * దరఖాస్తు చేసుకోవాలిలా..*

*అభ్యర్థులు కేవలం ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

మీ సేవా, ఏ.పి  ఆన్‌లైన్‌ సెంటర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 150 చెల్లించాలి.

ఓసీ, బీసీ విద్యార్థులు రూ. 200 ప్రవేశరుసుం చెల్లించాల్సి ఉంటుం ది.

ఈ మొత్తాన్ని ఆన్‌లైన్‌ సెంటర్‌లోనే చెల్లించాలి. సెంటర్‌చార్జి అదనంగా రూ. 25 వసూలు చేస్తారు.

 

ఐఐఐటీ*

 * ప్రవేశ అర్హతలు*

*2019 ఎస్‌ఎస్‌సీ లేదా తత్సమాన పరీక్షల్లో రాష్ట్రంలో గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఉత్తీర్ణులై ఉండాలి.

 * రిజర్వేషన్లు*

*ట్రిపుల్‌ ఐటీలో మొత్తం వెయ్యి సీట్లకు గానూ 85 శాతం సీట్లు ఓపెన్‌ కేటగిరీలో  ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ మెరిట్‌ విద్యార్థులకు ప్రవేశం కల్పించనున్నారు.

 * రిజర్వేషన్ల ప్రకారం పరిశీలిస్తే*

*ఎస్సీకి 15, ఎస్టీకి 7, బీసీ-ఏ- 7, బీసీ-బీ- 10, బీసీ-సీ 1, బీసీ-డీ 7, బీసీ-ఈ 4, దివ్యాంగులకు 3, క్రాప్‌ 2, ఎన్‌సీసీ 1, స్పోర్ట్స్‌ 0.5 శాతాల్లో సీట్ల కేటాయింపు ఉంటుంది.

దీంతోపాటు ఇతర రాష్ట్రాల విద్యార్థులకు 50 సీట్లు, ఎన్‌ఆర్‌ఐ కోటా కింద 20 సీట్లలో విద్యార్థులను భర్తీ చేయనున్నారు.

అన్ని విభాగాల్లో బాలికలకు 33.3 శాతం ప్రవేశాల్లో రిజర్వేషన్‌ను పాటిస్తారు.

Read the following instructions carefully.

 This application is for students belonging to Andhra Pradesh and Telangana students only.

 This application is for admission into 4 RGUKT campuses based on your campus preference. No separate application is needed for each campus.

 Print copy of the application along with necessary documents is to be posted to the following address if applied under NCC/PH/CAP/Sports : 

Mention on top of the cover “Application for Admissions 2019 – RGUKT, A.P.”

The Convener, 
UG Admissions 2019, 
Room No: 87, I3 Building, RGUKT Nuzvid, 
Nuzvid, Krishna District, Andhra Pradesh. Pin – 521202.

RGUKT FEE PAYMENT CLICK HERE

ONLINE APPLICATION FOR AP RGUKT ADMISSIONS

RGUKT OFFICIAL WEBSITE CLICK HERE

MAIN WEBSITE CLICK HERE

ANNEXURE-1 RULE OF RESERVATION CLICK HERE FOR DOWNLOAD

error: Content is protected !!