పదో తరగతి విద్యార్థుల మార్కుల మెమోలు శుక్రవారం నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ (డీజీఈ) ఎ.సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
DIRECTORATE OF GOVERNMENT EXAMINATIONS :: ANDHRA PRADESH S.S.C PUBLIC EXAMS, MARCH – 2019
పదోతరగతి మార్కుల జాబితాలను ప్రభుత్వ పరీక్షల విభాగం వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు సంచాలకులు ఎ.సుబ్బారెడ్డి తెలిపారు. ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు.. వారి స్కూల్ లాగిన్ ద్వారా మార్కుల పత్రాలను డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. డౌన్లోడ్ చేసుకున్న పత్రంపై సదరు ప్రధానోపాధ్యాయుడి సంతకం, పాఠశాల ముద్రతో విద్యార్థులకు అందచేయాలని వెల్లడించారు. ఇంటర్మీడియట్ ప్రవేశాలకు ఈ మార్కుల పత్రాలను వినియోగించుకోవచ్చని సూచించారు