Baseline Test 2022 Model Papers 2nd 3rd 4th 5th 6th 7th 8th 9th 10th Classes DOWNLOAD
BASELINE TEST 2022 INSTRUCTIONS :
- NCERT మరియు ప్రథమ్ ఫౌండేషన్
వారు సూచించిన టెస్టింగ్ టూల్స్ ఆధారంగా రూపొందించిన ప్రశ్నా పత్రాలతో
అన్ని ప్రభుత్వ (GOVT’ ZP, MUNICIPAL, APMS, KGBV, WELFARE SCHOOLS) మరియు
ఎయిడెడ్ యాజమాన్యాలలోని పాఠశాలలలో తేది 22.07.22 న బేస్లైన్ టెస్ట్
నిర్వహించడం జరుగుతుంది.23.07. 22 న ఇంగ్లీష్ , 25న మాథ్స్ బేస్ లైన్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది .
- బేస్లైన్ టెస్ట్ రెండవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుచున్న విద్యార్థులకు నిర్వహించాలి.
- ప్రశ్నా పత్రాలు సమగ్ర శిక్ష నుండి అందించబడతాయి.
- పరీక్ష ముగిసిన తరువాత జవాబు పత్రాలను మరియు ఇతర మెటీరియల్ ను రాష్ట్ర కార్యాలయానికి పంపాలి.
- ఒక్కొక్క ఉపాధ్యాయునికి నాలుగు పేజీల ఇన్స్ట్రుక్షన్స్ బుక్లెట్లు ఇవ్వబడతాయి.
- మరో ఐదు పేజీల ఓరల్ టెస్టింగ్ టూల్స్ ప్రశ్నా పత్రం ఇవ్వబడతాయి
- ప్రతి విద్యార్థికి పెన్ వినియోగించి వ్రాయ వలసిన నాలుగు పేజీల టెస్టింగ్ టూల్ ప్రశ్నా పత్రం ఇవ్వబడుతుంది.
- ఇవి పది సెట్స్ లో ఇవ్వబడతాయి.
- వీటిని
విద్యార్థులకు ఇచ్చేటప్పుడు మొదటి విద్యార్దికి సెట్ 1, రెండవ
విద్యార్థికి సెట్ 2, మూడవ విద్యార్థికి సెట్ 3, వరుస క్రమంలో ఇవ్వాలి.
- మొదటి పదిమంది విద్యార్థులకు వరుసక్రమంలో పది సెట్లు ఇచ్చిన తరువాత పదకొండవ విద్యార్థి నుండి మరల సెట్ 1 నుండి ప్రారంభించి ఇవ్వాలి.
- తెలుగు, ఇంగ్లీష్ , గణితంలలో బేస్లైన్ టెస్ట్ నిర్వహించాలి.
- బేస్లైన్ టెస్ట్ రెండు రకాలుగా ఉంటుంది.
- మొదటిది మౌఖిక పరీక్ష. రెండవది రాత పరీక్ష.
- రెండు నుండి పదవ తరగతి వరకు ఒకే రకమైన ప్రశ్నా పత్రం ద్వారా మౌఖిక పరీక్ష జరపాలి.
- మొదటి రోజు తెలుగు, రెండవ రోజు ఇంగ్లీష్ , మూడవ రోజు గణితంలో మౌఖిక పరీక్ష నిర్వహించాలి.
- మౌఖిక పరీక్ష కొరకు ప్రతి పాఠశాలకు రెండు శాంపిల్స్ ఇవ్వబడతాయి.
ప్రతి శాంపిల్ నందు ఐదు స్థాయిలు ఉంటాయి. అవి:
తెలుగు నందు:- ప్రారంభ స్థాయి, అక్షరాల స్థాయి, పదాల స్థాయి, పేరా స్థాయి, కథ స్థాయి.
గణితం నందు :- ప్రారంభ స్థాయి, ఒక అంకె సంఖ్యలు, రెండు అంకెల సంఖ్యలు, మూడు అంకెల సంఖ్యలు, గణిత ప్రక్రియలు
ఇంగ్లీష్ నందు :- ప్రారంభ స్థాయి, కాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, పదాలు, వాక్యాలు
విద్యార్థి చదవగలిగిన విధానాన్ని బట్టి ఆ విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నాడో గుర్తించాలి.
ఒక్కొక్క విద్యార్థిని వ్యక్తిగతంగా పిలిచి, చదివించి వారి స్థాయిని నిర్ధారణ చేయాలి
మౌఖిక పరీక్ష నిర్వహించగానే పిల్లల స్థాయిని రిజిస్టర్ నందు నమోదు చేయాలి. ఆన్లైన్ లో ఎంటర్ చేయాలి.
ముఖ్య గమనిక :-
- మౌఖిక పరీక్షలో నాలుగు, ఐదు స్థాయిలలో ఉన్న బాలలకు మాత్రమే రాత పరీక్ష నిర్వహించాలి.
- రెండు నుండి ఐదు తరగతుల విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్ లలో మాత్రమే రాత పరీక్ష ఉంటుంది.
- గణితంలో మాత్రం మౌఖిక పరీక్షలో ఉన్న చతుర్విద ప్రక్రియలు చేయగలిగిన విద్యార్థులు రాత పరీక్ష రాసినట్లు పరిగణించాలి.
- ఆరు నుండి పదవ తరగతుల విద్యార్థులకు తెలుగు, గణితం, ఇంగ్లీష్ లలో రాత పరీక్ష నిర్వహించాలి.
రాత పరీక్షలో మొత్తం నాలుగు స్థాయిలు ఉంటాయి. అవి
1. అసలు ఏమీ రాయని / చేయని వారు
2. ప్రయత్నిచారు కానీ అన్నీ తప్పులే
3. రెండు మాత్రమే సరిగా రాశారు.
4. అన్నీ సరిగ్గా రాశారు.
- ప్రధానోపాధ్యాయులు,
ఉపాధ్యాయులందరూ పైన పేర్కొన్న అంశాలన్నింటినీ క్షుణ్ణంగా అవగాహన చేసుకుని
విద్యార్థులకు ఇప్పటినుండే తగిన తర్ఫీదు ఇవ్వాలి.
- తేదీ 22.07.22 న విద్యార్థులందరూ హాజరగుటకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.
- ఉపవిద్యాశాఖాధికారులు,
మండల విద్యాశాఖాధికారులు వారి పరిధి లోని అన్ని ప్రభుత్వ మరియు ఎయిడెడ్
యాజమాన్యాల పాఠశాలల వారికి ఈ విషయాలు తెలియజేయడంతో పాటు, నిర్వహణ తీరును
పర్యవేక్షించవలసిందిగా కోరడమైనది.
- ఈనెల 22 నాడు అన్ని
తరగతులకు నిర్వహించబోయే బేస్ లైన్ టెస్ట్ శాంపిల్ పేపర్లను విడుదల చేశారు
రాత పరీక్ష మరియు మౌఖిక పరీక్షల్లో టెస్ట్ నిర్వహించబడుతుంది.