★ ఉపాధ్యాయ శిక్షణ నేస్తం (టీచర్ ఎడ్యుకేటర్స్), సాంకేతిక శిక్షణ నేస్తం (డిజిటల్, ఈ-కంటెంట్) రిసోర్సు పర్సన్ల నియామకానికి ప్రత్యేక పరీక్ష ద్వారా అర్హులైన ఉపాధ్యాయుల్ని ఎంపిక చేయనున్నారు.
ఈ నెల 22న ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) నిర్వహణ
★ ఉపాధ్యాయ శిక్షణ నేస్తం (యూఎస్ఎన్) కింద ఎస్ఆర్పీ, డీఆర్పీలను ఎంపిక చేసి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో పనిచేసే విధంగా ఎస్సీఈఆర్టీ శిక్షణ ఇవ్వనుంది.
ఉపాధ్యాయ శిక్షణ నేస్తం (టీచర్ ఎడ్యుకేటర్స్), సాంకేతిక శిక్షణ నేస్తం (డిజిటల్, ఈ-కంటెంట్) రిసోర్సు పర్సన్ల నియామకానికి ప్రత్యేక పరీక్ష ద్వారా అర్హులైన ఉపాధ్యాయుల్ని ఎంపిక చేయనున్నారు.
★ ప్రస్తుతం ఎస్జీటీ, పాఠశాల సహాయకులుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులకు దరఖాస్తు చేసుకున్నారు.
★ వీరికి ఈ నెల 22న ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) నిర్వహించనున్నారు.
★ ఈ-కంటెంట్ రైటర్లు, రిసోర్సు పర్సన్లు, డైట్ లెక్చరర్లు, విషయ(సబ్జెక్టు) నిపుణులు, డీసీఈబీ సభ్యులు, ఎస్సీఈఆర్టీలో నియామకానికి ఈ ప్రత్యేక పరీక్ష నిర్వహించనున్నారు.
★ పోస్టును బట్టి నిర్దేశిత సిలబస్ను రూపొందించారు.
ఉపాధ్యాయ శిక్షణ నేస్తం (యూఎస్ఎన్) కింద ఎస్ఆర్పీ, డీఆర్పీలను ఎంపిక చేసి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో పనిచేసే విధంగా ఎస్సీఈఆర్టీ శిక్షణ ఇవ్వనుంది.
సాంకేతిక శిక్షణ నేస్తాలు పాఠ్యప్తుకాల ఆధారంగా ఈ-కంటెంట్, ఈ-పాఠ్య ప్రణాళికను అభివృద్ధి చేయటం, డిజిటల్, వర్చువల్ తరగతి గదులు, డిజిటల్ విద్య శిక్షణ, కంప్యూటర్ లేబొరేటరీలను కచ్చితంగా ఉపయోగించటంలో శిక్షణ ఇస్తారు.
రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల పోస్టులకు పరీక్ష నిర్వహిస్తారు. ఎస్సీఈఆర్టీలో పనిచేయటానికి జిల్లా నుంచి సీనియర్ అధ్యాపకులుగా 7గురు, అధ్యాపకులుగా 13 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.