ప్రాథమిక పాఠశాలలకు సంబంధించి మొత్తం 15 మందిలో కమిటీ ఏర్పాటు చేసుకోవాలి• ☆ఒక్కో తరగతికి ముగ్గురు చొప్పున విద్యార్థుల తల్లిదండ్రులను ఎన్నుకోవాలి• ఈలెక్కన ప్రాథమిక పాఠశాలల్లో ఐదు తరగతులకు సంబంధించి 15 మంది సభ్యులు ఉంటారు*•
*☆ప్రాథమికోన్నత పాఠశాలలకు తరగతికి ముగ్గురు చొప్పున ఏడు తరగతులకు కలిపి 21 మంది సభ్యులను ఎన్నుకుంటారు• ☆అందులో ఒకరు చైర్మన్ గా,మరొకరిని వైస్ చైర్మన్ గా ఎన్నుకుంటారు• మిగిలిన వారు సభ్యులుగా ఉంటారు*•
☆☆ *వీరితోపాటు ప్రతి పాఠశాలలో ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఆరుగురిని నియమిస్తారు*•
*☆సర్పంచి, వార్డుమెంబర్,అంగన్వాడీ వర్కర్,మహిళా మండలి సభ్యులు, ఇద్దరు టీచర్లను నియమించనున్నారు*•
కమిటీ విధులు,భాధ్యతలు
*☆1. పాఠశాల అభివృద్దికి విద్యాకమిటీ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది• పాఠశాలలో మౌలిక వసతులు ఏర్పాటు*••
*☆2. విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు పర్యవేక్షణ*••
*☆3. బడి బయట పిల్లలను గుర్తించి వారిని బడికి వచ్చేలా ఒప్పించడం*••
*☆4. మధ్యాహ్న భోజనం పర్యవేక్షణ*••
*☆5. స్కూల్ డెవలప్ మెంట్ ప్లానింగ్ తయారు చేయడం,ప్లానింగ్ ను సక్రమంగా అమలు అయ్యేలా చూడటం*••
*☆6. పాఠశాలలకు విడుదల అయిన నిధులు సక్రమంగా వినియోగం అయ్యేలా పర్యవేక్షణ చేయడం*••
*☆7. దాతలను, పూర్వ విద్యార్థులను ప్రోత్సహించి పాఠశాలలకు మౌలిక సదుపాయాలు పెంచాల్సి ఉంటుంది*•®
పాఠశాలల యాజమాన్య కమిటీ (SMC) తాజా ఎన్నికల నిర్వహణకై షెడ్యూల్ తో కూడిన మెమో విడుదల చేసిన ఏపి పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్ గారు.
*షెడ్యూల్…:*
• *16-09-2019..:* ఉ.10 గం.లకు నోటిఫికేషన్ విడుదల చేయవలెను.
• *19-09-2019…:* ఉ.9 గం.ల నుంచి మ.1 గం.ల వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ మరియు మ.3 గం.ల నుంచి 4 గం.ల మధ్యలో తుది ఓటర్ల జాబితాను నోటీసు బోర్డులో ప్రదర్శించవలెను.
• *23-09-2019…:* కమిటి ఎన్నిక, చైర్మన్ & వైస్ చైర్మన్ ఎన్నిక మరియు *మొదటి సమావేశం నిర్వహణ.*