SCERT – డిజిటల్ ఎడ్యుకేషన్ లో భాగంగా యూట్యూబ్ ఛానల్ అయిన లైవ్ స్ట్రీమింగ్ ఛానల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అందరు ఉపాధ్యాయులకు సాంకేతిక విజ్ణానాన్ని అందించే క్రమంలో E-content webinars ను నిర్వహించబోతుంది.
దీనిలో భాగంగా 23/04/2020 నుంచీ 27/04/2020 వరకు ప్రతీ రోజు మధ్యాహ్నం 2:00 నుంచీ 3:00 గంటల వరకు ఒక్కోరోజు ఒక్కో అంశానికి సంబందించిన webinars ప్రత్యక్ష ప్రసారం(లైవ్ స్ట్రీమింగ్ ) చేయబడతాయి.
ఉపాద్యాయుడు నిరంతర విద్యార్థి.
మారుతున్న విద్యా ప్రమాణాలు, సరికొత్త పోకడలు, సాంకేతిక పరిజ్ఞానం వంటబట్టించుకొని మన బోధనకు మరింత మెరుగుపెట్టి మన ముందు ఉన్న 2020 విద్యార్థికి సాంకేతిక జ్ణానంతో కూడిన విద్యని మనం ఇవ్వాలంటే మనం ముందు నేర్చుకోవాలి కదా.?
కాబట్టి ఈ online classes వినాలంటే మనమేమి కష్టబడనక్కరలేదు.
2:00 నుండీ 3:00 వరకు ఇంట్లో ఉండి మనం విజ్ఞానాన్ని పొందవచ్చు.
మరి., ఇంకెందుకాలస్యం
పైన పంపిన లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోండి.
రేపటినుండి ప్రసారమయ్యే webinars వీక్షించండి.
Teachers can register through this form to participate in the Webinar being conducted by SCERT Andhra Pradesh.
All management teachers can register to participate in Webinars since these sessions are basic SGTs, SAs, HMs and Lecturers – Any subject teachers can also register