దేశంలోని వివిధ యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో సైన్స్ విభాగంలో లెక్చరర్షిప్, జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్స్ (జేఆర్ఎఫ్) అర్హత కోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సంయుక్తంగా ఏడాదికి రెండుసార్లు ఈ అర్హత పరీక్షను నిర్వహిస్తాయి.
దేశంలోని వివిధ యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో సైన్స్ విభాగంలో లెక్చరర్షిప్, జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్స్ (జేఆర్ఎఫ్) అర్హత కోసం నిర్వహించనున్న ‘సీఎస్ఐఆర్-యూజీసీ నెట్- డిసెంబరు 2019’ పరీక్ష హాల్టికెట్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నవంబరు 9న విడుదల చేసింది.
అధికారిక వెబ్సైట్లో హాల్టికెట్లను అందుబాటులో ఉంచింది. పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సంయుక్తంగా ఏడాదికి రెండుసార్లు ఈ అర్హత పరీక్షను నిర్వహిస్తాయి.
ఈ ఏడాది ప్రథమార్థానికిగాను జూన్ 16న నెట్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.
రెండో విడతగా డిసెంబరు 15న పరీక్ష నిర్వహించనున్నారు.
పరీక్ష విధానం ఎలా ఉంటుంది..?
★ మొత్తం 5 సబ్జెక్టులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో కెమికల్ సైన్సెస్, ఎర్త్/ అట్మాస్ఫియరిక్/ ఓషియన్/ ప్లానెటరీ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ సబ్జెక్టులు ఉంటాయి.
ప్రతి సబ్జెక్టు నుంచి మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 3 గంటలు.
పరీక్షలో సబ్జెక్టుల వారీగా నెగెటివ్ మార్కులు ఉంటాయి.
★ పరీక్ష పేపర్లో మూడు (పార్ట్-ఎ, పార్ట్-బి, పార్ట్-సి) విభాగాలుంటాయి.
– ‘పార్ట్-ఎ’ విభాగంలో జనరల్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, గ్రాఫికల్ అనాలసిస్, అనలిటికల్ & న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ కంపారిజన్, సిరీస్, ఇతర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
– ‘పార్ట్-బి’, ‘పార్ట్-సి’ విభాగాల్లో సంబంధిత సబ్జెక్టు నుంచి ప్రశ్నలు అడుగుతారు.
రాత పరీక్ష ఎప్పుడు..? డిసెంబరు 15న రాతపరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. ఉ.9.00 గం.- మ.12.00 గం. వరకు మొదటి సెషన్లో, మ.2.00 గం.-సా.5.00 గం. వరకు రెండో సెషన్లో పరీక్షలు నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా మొత్తం 27 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, గుంటూరులో పరీక్ష నిర్వహణ ఉంటుంది.