Grama-Sachivalayam-Jobs-Eligibility-Marks-to-reduce

Grama-Sachivalayam-Jobs-Eligibility-Marks-to-reduce

సచివాలయ’ ఫలితాలు.. ఆ పోస్టులకు అర్హత మార్కులు తగ్గింపు ఖాయం.. ఎందుకంటే?

మిగిలిపోయిన ఉద్యోగాల భర్తీకి మళ్లీ నోటిఫికేషన్‌ జారీ చేయాల్సిన అవసరం లేకుండా..

అర్హత మార్కులను తగ్గించి, ఆ మేరకు మార్కులు వచ్చిన వారితో ఖాళీలను భర్తీ చేసే అవకాశం ఉంది.

ఆరు విభాగాల్లో మిగిలిపోయిన 20 వేలకు పైగా పోస్టులు

అర్హత మార్కులను తగ్గించి భర్తీ చేసే యోచనలో ప్రభుత్వం

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలను సెప్టెంబరు 19న వెల్లడించిన సంగతి తెలిసిందే.

మొత్తం 1.26 లక్షల ఉద్యోగాలకు 21 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా..

వారిలో 19.5 లక్షలకు పైగా అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు.

పరీక్షలకు హాజరైనవారిలో కేవలం 10.15 శాతం మాత్రమే అర్హత సాధించారు.

అంటే 1.98 లక్షల మంది అభ్యర్థులు అర్హత మార్కులు సాధించారు.

ఇదిలా ఉండగా.. ఆరు విభాగాలో విభాగాల్లో పోస్టుల సంఖ్యతో పోలిస్తే..

అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉంది. ఈ ఆరు విభాగాల్లో దాదాపు సగం పోస్టలకు సరైన అభ్యర్థులు లేరు.

అయితే ఉద్యోగాల నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఖాళీలకు తగినంత మంది అభ్యర్థులు ఎంపిక కాకపోతే అర్హత మార్కులను తగ్గించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఓసారి ఖాళీల వివరాలను పరిశీలిస్తే..
ఆరు విభాగాల్లో మొత్తం 39,176 పోస్టులకుగానూ 18,217 మంది అభ్యర్థులు మాత్రమే అర్హత సాధించారు.

మిగతా 20,959 పోస్టులు ఖాళీగానే మిగిలాయి.

అర్హత మార్కులను తగ్గించడం ద్వారా మిగతా ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేస్తే.. మరింత మంది అభ్యర్థులు ప్రయోజనం పొందుతారు.

ఖాళీల వివరాలు ఇలా ..

ఏపీ ఏనిమల్ హస్బెండరీ సబార్టినేట్ సర్వీసెస్‌లో మొత్తం 9,886 ఖాళీలకుగానూ.. 6,265 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

వీరిలో 5,608 మంది పరీక్షకు హాజరుకాగా..2,163 మంది మాత్రమే అర్హత సాధించారు.

అంటే ఈ విభాగంలో అర్హత పొందినవారు కాకుండా మొత్తంగా 7,723 పోస్టులు మిగిలిపోయాయి.

1,158 పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్-6) డిజిటల్ అసిస్టెంట్ పోస్టులకు కేవలం 3,623 మంది అర్హత సాధించారు.

✦ వార్డు శానిటేషన్, ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ పోస్టులకు సంబంధించి..

మొత్తం 3,648 పోస్టులకుగాను 1,474 మంది అర్హత
సాధించారు.

మొత్తం 4000 విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్టులకుగాను 2,622 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.

✦ వార్డు ప్లానింగ్, రెగ్యులేషన్ సెక్రటరీ పోస్టులకు సంబంధించి మొత్తం 3,770 పోస్టులు ఉండగా.. 2,096 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.

✦ ఇక విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ పోస్టులు 6,714 ఉండగా..6,239 మంది అర్హత సాధించారు.

ఆరు విభాగాల్లో మిగిలిపోయిన పోస్టుల వివరాలు..

పోస్టులు

ఖాళీలు

అర్హులు

మిగిలిన పోస్టులు

ఏనిమల్ హస్బెండరీ అసిస్టెంట్

9,886

2,163

7,723

పంచాయతీ సెక్రటరీ (గ్రేడ్-6)

డిజిటల్ అసిస్టెంట్

11,158

3,623

7,535

వార్డు శానిటేషన్, ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ

3,648

1,474

2,174

విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్

4000

2,622

1,378

వార్డు ప్లానింగ్, రెగ్యులేషన్ సెక్రటరీ

3,770

2,096

1,674

విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్

6,714

6,239

475

మొత్తం

39,176

18,217

20,959

రేపటి నుంచి ‘సచివాలయ’ ధ్రువపత్రాల పరిశీలన వివరాలు

error: Content is protected !!