Candidates have to score equal to or greater than the minimum marks to qualify in the examination.
For General Category: 40% (60 Marks)
For OBC Category: 35% (52.5 Marks)
For SCs, STs and PHs Category: 30% (45 Marks)
ఫలితాల ప్రకటన అనంతరం, అర్హులైన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్ లను వెబ్ సైట్ నందు అప్లోడ్ చేయవలెను. తరువాత జిల్లా యంత్రాంగం ద్వారా తెలుపబడిన తేదిలలో నిర్ణీత ప్రదేశములకు వెళ్లి వారి సర్టిఫికేట్ లను తనిఖి చేయించుకోవలెను.
వెరిఫికేషన్ షెడ్యూలు :
• ఫలితాల విడుదల 19.09.2019
• సర్టిఫికేట్ లను వెబ్ సైట్ నందు అప్లోడ్ 21.09.2019 నుండి
• కాల్ లెటర్ పంపిణి 21.09.2019 – 22.09.2019
• తనిఖి జరిగే తేదీలు 23- 25 సెప్టెంబర్ 2019
• నియామక ఉత్తర్వుల జారి 27.09.2019
• అవగాహనా కార్యక్రమం 1&2 అక్టోబర్ 2019
• గ్రామ/వార్డు సచివాలయ ప్రారంభం 02.10.2019
గ్రామ/వార్డు సెక్రటేరియట్ ఉద్యోగుల నియమాక పరీక్ష ఫలితాలు 2019
ముఖ్యమైన అంశాలు- తేదీ 19-09-2019
ప్రభుత్వ సేవలను పారదర్శకంగా, అవినీతి రహితంగా ప్రజల గుమ్మంముంగిటే అందచేయటానికిగ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ,గ్రామ/వార్డు వాలంటీర్ల వ్యవస్థలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
రాష్ట్ర ప్రభుత్వంచే ప్రతిష్టాత్మకంగా అమలు చేయబడుతున్న “నవరత్నాలు” కార్యక్రమం ద్వారా అందజేసే లబ్ధిని అర్హులైన కుటుంబాలకు చేర్చడానికి గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థల ఏర్పాటు
ప్రతీసచివాలయంలో 11 నుంచి 12 మంది శాశ్వతప్రభుత్వ ఉద్యోగులను నియమించి, ప్రభుత్వ సేవల్లోనాణ్యత పెంపొందించే నిమిత్తంప్రభుత్వం మొత్తం 1,26,728(95,088 గ్రామీణ ప్రాంతాలలో, 36,410 పట్టణ ప్రాంతాలలో) ఉద్యోగాలనుకొత్తగా సృష్టించి, వాటిని పోటీ పరీక్ష ద్వారా నేరుగా ఎంపిక చేయటానికి 26.7.2019 న కామన్ నోటిఫికేషన్ విడుదల చేసాము
క్రొత్తగా ఏర్పాటు చేసేగ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థలుఅక్టోబర్ 2నుండి అమలులోకివస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా 11158 గ్రామ సచివాలయాలను, 3786 వార్డు సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నాము
తేదీ 1.9.2019 నుండి 8.9.2019 వరకు గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది ఎంపిక పరీక్షలను 6 రోజులపాటు విజయవంతంగా నిర్వహించడం జరిగింది.
దేశ చరిత్రలోనే ఒకే రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ద్వారా 1,26,728 మందిని ఎంపిక చేసేందుకు పోటీ పరీక్షలను ఒక రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం ఒక అరుదైన రికార్డు.
అభ్యర్థుల హాజరు: 19 రకాలయిన పోస్టులను భర్తీ చేయడానికి ఉద్దేశించిన 14 రకాల పరీక్షలకు మొత్తం 21.69 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు మరియు 19.50 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష కు హాజరు అయినారు.
పరీక్షలను ఎటువంటి పొరపాట్లు లేకుండా పూర్తి పారదర్శకతతో, నిష్పక్షపాతంగా నిర్వహించడం జరిగింది.
సమాధాన పత్రాల మూల్యాంకనం
19,50,630 మంది అభ్యర్ధులకు చెందిన ఓ ఎం ఆర్ సమాధాన పత్రాలనుతేదీ 3.9.2019 నుండి 9.9.2019 వరకూ రికార్డు సమయంలో స్కాన్ పూర్తి చేయటం జరిగింది
స్కానింగ్ పూర్తి అయిన తరువాత వచ్చిన ఫలితాలను, ఈ రంగం లో నిష్ణాతులైన “STATISTICAL TEAM” ద్వారా మరియొకసారి సరి చూసుకోవటం కోసం STRATIFIED రాండమ్ శాంప్లింగ్ పద్ధతిలో 10,000 OMR సమాధాన పత్రాలను సరి చూడడం జరిగింది.ముల్యాంకం లో ఎటువంటి తప్పులు దొర్లలేదని ద్రువికరించకోవడం జరిగింది.
పరీక్షా ఫలితాలు
అభ్యర్ధులను ఎంపిక చేయటానికి కనీస ఉత్తీర్ణతా మార్కులు
• ఓపెన్ కేటగిరీ అభ్యర్ధులకు 40%
• వెనుక బడిన తరగతులకు చెఇన్దిన వారికి 35%
• ఎస్.సి /ఎస్.టి /వికలాంగులకు 30%
హాజరు అయిన 19,50,630 మంది అభ్యర్ధులలో 1,26,728ఉద్యోగాలకు 198164 మంది అభ్యర్ధులు ఉత్తీర్ణులయ్యారు
• ఓపెన్ కేటగిరిలో 24583
• బి. సి. కేటగిరిలో 100494
• ఎస్ . సి కేటగిరిలో 63629
• ఎస్. టి .కేటగిరిలో 9458
• వీరిలో పురుషుల 131327. స్త్రీలు 66835 ఉత్తీర్ణులు అయ్యారు
జరిగిన 14 పరీక్షలలోఉత్తమ ప్రతిభ కనబరచిన అభ్యర్ధులు సాధించిన మార్కులు
• ఓపెన్ కేటగిరిలో అత్యధికంగా 122.5 మార్కులు
• బి. సి. కేటగిరిలో అత్యధికంగా 122.5 మార్కులు .
• ఎస్ . సి కేటగిరిలో అత్యధికంగా 114 మార్కులు సాధించారు
• ఎస్. టి .కేటగిరిలో అత్యధికంగా 108 మార్కులు సాధించారు
మహిళా అభ్యర్దులల్లో గరిష్టంగా 112.5 మార్కులు
పురుష అభ్యర్ధుల్లో గరిష్టంగా 122.5 మార్కులు
ఇన్ సర్వీస్ అభ్యర్ధులకు 10% వెయిటేజ్ మార్కులు విడిగా కలపబడతాయి.
పరీక్ష ఫలితాలను ఈ దిగువ సూచించిన గ్రామ సచివాలయము/ఆర్ టి జి. ఎస్ వెబ్ సైట్ నందు అభ్యర్థి హాల్ టికెట్ నెంబరు మరియు పుట్టిన తేది ఆధారంగా తెలుసుకొనవచ్చును.
The minimum qualifying marks for consideration of a candidate to the selection process are 40% (60 Marks) for OCs,
35% (52.5 Marks) for BCs and
30% (45 Marks) for SCs, STs and PHs or as per rules.