ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం కొత్త ఓటర్ల నమోదు, సవరణలకు జనవరి 22 ఆఖరు తేదీ.*
* ఓటు నమోదు ఇలా..*
* 2020 జనవరి ఒకటో తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువత తమ పేరును ఓటరు జాబితాలో నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇందుకు ఆన్లైన్లోనూ, నేరుగా తహసీల్దారు, బీఎల్వోల వద్ద ఫారం-6లో దరఖాస్తు చేయవచ్చు. ఆన్లైన్లో సీఈవో ఆంధ్ర వెబ్సైట్ లోనూ, www.nvsp.in లో ఫారం-6ని పూర్తి చేయడం ద్వారా ఓటుహక్కు పొందవచ్చు.
ఇందుకు వయస్సు ధ్రువీకరణ పత్రంతో పాటు, ఫొటోలు అప్లోడ్ చేయాలి.*
* ఫారం-6ఏలో ప్రవాస భారతీయులు ఓటుహక్కు కోసం నమోదు చేసుకోవచ్చు.*
* ఫారం-7 దరఖాస్తుతో ఓటరు జాబితాలో పేరు తొలగించేందుకు ఆక్షేపణ చేయవచ్చు.*
* ఫారం-8 ద్వారా ఓటరు జాబితాలో పేరు, చిరునామాలో తప్పులు ఉంటే సవరించుకోవచ్చు.*
* ఫారం-8ఏ దరఖాస్తు ద్వారా నియోజకవర్గ పరిధిలో ఒక పోలింగ్ కేంద్రం నుంచి మరో పోలింగ్ కేంద్ర పరిధిలోకి ఓటు హక్కును మార్చుకోవచ్చు.*
* ఫిబ్రవరి 14న ఫొటో ఓటర్ల తుది జాబితా..*
*ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఓటర్ల నమోదు, సవరణల కోసం డిసెంబరు 23నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
ఈ నెల 22వరకు ఆన్లైన్లో, పోలింగ్ కేంద్రాలు, తహసీల్దారు కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారు.
అందిన దరఖాస్తులను ఫిబ్రవరి మూడో తేదీ లోపు క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా పరిష్కరించనున్నారు.