Home/ BLOG / mid-day-meal-revision-of-menu-items-for-mdm-instructions
mid-day-meal-revision-of-menu-items-for-mdm-instructions
mid-day-meal-revision-of-menu-items-for-mdm-instructions
మధ్యాహ్న భోజనంలో పెరగనున్న నాణ్యత.. *
మధ్యాహ్న భోజన మెనూ
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని జగనన్న గోరుముద్ద గా మార్చి రోజువారీ పెట్టవలసిన మెనూ ని మార్చడం జరిగింది.
దీనికోసం మనం మన ప్రాధమిక పాఠశాలలో సోమవారం నుంచి శనివారం వరకు ఏ రోజు ఏ భోజనం పెట్టాలి, వాటికి కావలసిన సరుకులు ఎంత వేయాలి అనే విషయాలన్నీ మీ జిల్లా పేర్లు తో ఒక ఫ్లెక్సీలో పొందుపరచడం జరిగింది.
కావలసినవారు వారి జిల్లా వారీగా ఫ్లెక్సీలు డౌన్ లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకుని పాఠశాలలో పెట్టుకోవచ్చు.
★ మధ్యాహ్న భోజన పథకంలో జనవరి నెల 21 నుంచి మార్పులు,
మెనూ మారడంతో పాటు నిర్వాహకులకు చెల్లించే సొమ్ములు కూడా పెరగనున్నాయి.
★ ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు ప్రస్తుతం ఒక్కో విద్యార్థికి రూ.4.48 ఇస్తున్నారు.
ఇక నుంచి వారికి రూ.6.60 చొప్పున ఇవ్వనున్నారు.
★ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్రస్తుతం రూ.6.11 ఇస్తుండగా..
ఇక నుంచి వారికి రూ.8.80 ఇవ్వనున్నారు.
★ విద్యార్థులకు అందించే ఒక్కో చిక్కీకి (వేరుశనగపప్పు అచ్చు) రూ. 1.69 ఇవ్వనున్నారు.
★ ఆయా పాఠశాలలో నిర్వాహకులు వీటిని తయారు చేయాల్సి ఉంది.
★ మారిన మధ్యాహ్న భోజన పథకం మెనూపై జిల్లా స్థాయిలో శిక్షణ ఇవ్వనున్నారు.
★ ప్రతి మండలం నుంచి ఎంఈవో, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఇద్దరు మధ్యాహ్నభోజన నిర్వాహకులు హాజరు కావాల్సి ఉంది.
★ వీరందరికీ జిల్లా స్థాయిలో ఒక రోజు శిక్షణ ఇస్తారు.
వీరు మండల స్థాయిలో సిబ్బందికి శిక్షణ ఇవ్వాల్సి ఉంది.
★ మండల స్థాయి శిక్షణకు ప్రధానోపాధ్యాయుడు, ఇద్దరు మధ్యాహ్న భోజన నిర్వాహకులు హాజరు కావాల్సి ఉంది.
★ గత సమీక్షా సమావేశాల్లో మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఇచ్చిన ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.
★ మెనూలో తీసుకువస్తున్న మార్పులపై సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకోసం రూ.200 కోట్లు అదనంగా ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు.
★ ఆహారాన్ని నాణ్యంగా వండటానికి ఆయాలకు రూ.3వేల చొప్పున జీతాలు చెల్లిస్తున్నామని చెప్పారు.
మొత్తంగా రూ. 343.55 కోట్లు అదనంగా ఖర్చు చేస్తున్నట్టు వెల్లడి.
★ మొత్తంగా రూ. 1294 కోట్లు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు.
ఫిబ్రవరి 20 నుంచి అంతటా నాణ్యమైన భోజనం అందుబాటులోకి వస్తుందన్నారు.
మెనూ వివరాలు..
★ సోమవారం : అన్నం, పప్పుచారు, ఎగ్ కర్రీ, చిక్కి
★ మంగళవారం : పులిహోర, టమోటా పప్పు, ఉడికించిన గుడ్డు
★ బుధవారం : కూరగాయల అన్నం, ఆలు కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కి
★ గురువారం : కిచిడి (పెసరపప్పు అన్నం), టమోటో చట్నీ, ఉడికించిన గుడ్డు
★ శుక్రవారం : అన్నం, అకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కి
★ శనివారం : అన్నం, సాంబార్, స్వీట్ పొంగల్
జనవరి 21వ తేదీ నుంచి పాఠశాలల్లో ప్రవేశ పెట్టనున్న MDM కొత్త మెనూ వివరాలు ఇలా..
Tags mid-day-meal-revision-of-menu-items-for-mdm-instructions