national-talent-search-examination-ntse-notification-2018-2019
ది.04.11.2018 న నిర్వహించబోయే నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ (ఫస్ట్ లెవెల్) కొరకు రాష్ట్రంలోని 10వ తరగతి చదివే విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి.
ఈ పరీక్ష రాయుటకు రాష్ట్రంలోని అన్ని గుర్తింపు పొందిన విద్యా సంస్థలు,
కేంద్రీయ విద్యాలయాలు,
నవోదయ విద్యాలయాలు,
సి.బి.ఎస్.ఇ మరియు ఐ.సి.ఎస్.ఈ నుండి గుర్తింపు పొందిన విద్యాలయాలలో చదువుతున్న విద్యార్థులందరూ ఈ పరీక్ష రాయడానికి అర్హులు.
ఈ సంవత్సరం నుండి (ఫస్ట్ లెవెల్) పరీక్ష రెండు దఫాలుగా నిర్వహించబడును. ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి 11 గంటల 30 నిమిషాల వరకు మొదటి పరీక్ష,
మధ్యాహ్నం 2 గంటల నుండి నాలుగు గంటల వరకు రెండవ పరీక్ష నిర్వహించబడును.
ఈ పరీక్ష రుసుము 200 రూపాయలు సి.ఎఫ్.ఎం.ఎస్ ద్వారా తీసుకోవాలి.
మరింత సమాచారం కొరకు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయపు వెబ్సైట్ను కానీ జిల్లా విద్యాశాఖ అధికారి వారి కార్యాలయాలలో గాని సంప్రదించాలి.
ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించడానికి ఆఖరి తేదీ సెప్టెంబర్ 27
రుసుము చెల్లించడానికి ఆఖరి తేదీ సెప్టెంబర్ 28.
దరఖాస్తులు ఆగస్టు 24వ తేదీ నుండి స్వీకరించబడును.
HOW TO APPLY NTSE SCHOLARSHIPS CLICK HERE