▪ ప్రేరణ కలిగించడానికి, ఆర్థికంగా ఆదుకోవడం కోసం ఏటా పదోతరగతి చదువుతున్న విద్యార్థులకు నిర్వహించే నేషనల్ టాలెంట్ సెర్చ్ స్కీం (ఎన్టీఎస్ఈ) పరీక్ష ప్రకటన విడుదల.
°▪ కేవలం పదోతరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే ఈ పరీక్ష రాయడానికి అర్హులు.
▪ ఈ పరీక్ష రెండు దశల్లో జరుగుతుంది.
▪ మొదటి దశ రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తారు.
▪ మొదటి దశలో అర్హత సాధించిన విద్యార్థులను రెండోదశకు ఎంపిక చేస్తారు.
▪ ప్రతి రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న ఎస్సీఈఆర్టీఈలు ఈ పరీక్షను నిర్వహిస్తాయి.
▪ మొదటి దశలో అర్హత సాధించిన వారికి రెండోదశ పరీక్షను ఎన్సీఈఆర్టీఈ దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది.
▪ కేవీ, నవోదయ, ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల్లో పదోతరగతి చదువుతున్నవారు అర్హులు. ఓపెన్, డిస్టెన్స్ లెర్నింగ్ విధానంలో విద్యను అభ్యసిస్తున్నవారు కూడా అర్హులే.
▪ 2019, జూలై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 ఏండ్లు మించరాదు. మొదటిసారి పదోతరగతి పరీక్షకు హాజరుకానున్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
దరఖాస్తు విధానం
▪ ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలోని లైజన్ ఆఫీసర్లు ప్రత్యేక ప్రకటన విడుదల చేస్తారు.
▪ ఆ ప్రకటనలో తెలిపిన విధంగా దరఖాస్తును పూర్తి చేసి పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సంతకంతో సంబంధిత అధికారికి పంపాలి.