జాతీయ ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు దరఖాస్తు చేసుకునే గడువును పొడిగిస్తూ జాతీయ పరీక్షల మండలి (ఎన్టీఏ) ఏప్రిల్ 30న నిర్ణయం తీసుకుంది.
జాతీయ స్థాయిలో జరిగే అయిదు ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు దరఖాస్తు చేసుకునే గడువును పొడిగిస్తూ జాతీయ పరీక్షల మండలి(ఎన్టీఏ) ఏప్రిల్ 30న నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో ఆన్లైన్లో దరఖాస్తు గడువును మరోసారి పెంచినట్లు తెలిపింది.
వీటికి మే 15 వరకు: 1) నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్(ఎన్సీహెచ్ఎం),
2) జేఈఈ, ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) ప్రవేశ పరీక్ష (పీహెచ్డీ, ఎంబీఏ కోసం),
3)భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్),
4) జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ప్రవేశ పరీక్ష (జేఎన్యూఈఈ)లకు దరఖాస్తు గడువు ఏప్రిల్ 30తో ముగిసిన నేపథ్యంలో దీన్ని మే 15 వరకు పెంచారు
5) యుష్ పీజీ ప్రవేశ పరీక్ష (ఏఐఏపీజీఈటీ) గడువు జూన్ 5 వరకు పొడిగించారు.