Good News: మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీలు లేవు… ఇంకా మరెన్నో శుభవార్తలు
కరోనా వైరస్ ప్రభావంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి, ఆర్థిక వ్యవహారాల విషయంలో టెన్షన్ పడుతున్నవారికి ఊరట కల్పించారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.
మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం తలనొప్పిగా మారిందా? మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే ఛార్జీలు చెల్లించాల్సి వస్తుందని టెన్షన్ పడుతున్నారా? మూడు నెలల వరకు మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీలు లేవు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన వరమిది.
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి.
భారతదేశంలోనూ ఇదే పరిస్థితి. పలు రాష్ట్రాల్లో లాక్డౌన్తో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.
ఇబ్బందులూ ఎదుర్కొంటున్నారు.
ఆర్థికంగా అందరూ కష్టాల్లో ఉన్నారు. వారందరికీ ఊరట కల్పించేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అనేక కీలక నిర్ణయాలను ప్రకటించారు.
అందులో ఒకటి బ్యాంకుల్లో మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీలను ఎత్తేయడం.