SBI-new-atm-withdrawal-charges-revision-from-1st-october

SBI-new-atm-withdrawal-charges-revision-from-1st-october

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి ఈ నిర్ణయాలు అమల్లోకి వస్తాయి

కస్టమర్లు తమ బ్యాంకు ఖాతాల్లో ఉంచాల్సిన మినిమమ్ ఎమౌంట్ మొత్తాన్ని తగ్గించింది.

ఎస్‌బీఐ తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం పట్టణ ప్రాంతాల్లోని ఖాతాల్లో కనీసం రూ.3 వేలు ఉంచుకోవాలి. గతంలో ఇది రూ.5 వేలుగా ఉండేది.

అదే విధంగా సెమీ అర్బన్ ప్రాంతాల్లో కనీసం రూ.2 వేలు ఉంచాలి.

గ్రామీణ ప్రాంతాల్లోని ఖాతాదారులు కనీసం ఒక వెయ్యి రూపాయలు ఉంచుకోవాలని బ్యాంకు ప్రకటించింది.

నిబంధనలు పాటించని ఖాతాదారులపై ఛార్జీల మోత మోగనుంది.

పట్టణ ప్రాంతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ రూ.1500 వరకు మాత్రమే ఉంటే అటువంటి ఖాతాలపై రూ.10 చార్జ్ వసూలు చేస్తారు.

రూ.750 వరకు ఉంటే రూ.12.75 చార్జ్ వసూలు చేస్తారు. అంతకన్నా తక్కువగా ఉంటే రూ.15 ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. వీటికి జీఎస్టీ అధనం.

సేవింగ్స్ ఖాతాల్లో సొమ్ము డిపాజిట్ చేయాలనుకుంటే ఇకపై నెలకు మూడుసార్లు మాత్రమే డిపాజిట్ చేసేలా రూల్స్ మార్చారు.

మూడుసార్లు లిమిట్ దాటిన తర్వాత నాలుగోసారి డిపాజిట్ చేసినా, అది కూడా కనీసం రూ.100 రూపాయలు డిపాజిట్ చేసినా కూడా రూ.50 ఛార్జీలు వసూలు చేయనున్నారు.

హోం బ్రాంచి నుంచి కాకుండా వేరే బ్రాంచి నుంచి డిపాజిట్ చేయదల్చుకుంటే గరిష్టంగా రూ.2 లక్షల వరకు మాత్రమే అనుమతి ఇస్తారు.

ఖాతాలో కనీసం రూ.25 వేలు బ్యాంకు బ్యాలెన్స్ ఉంచే వ్యక్తులు రెండు సార్లు ఉచితంగా నగదు ఉపసంహరణ చేసుకునే వీలు కల్పించారు.

రూ.25 వేల నుంచి 50 వేల మధ్య బ్యాలెన్స్ ఉంచే ఖాతాదారులు నెలకు 10 సార్లు విత్ డ్రా చేసుకోవచ్చు.

మినిమమ్ నెలకు రూ.1 లక్ష బ్యాలెన్స్ ఉంచే కస్టమర్లు ఎన్నిసార్లయినా విత్‌డ్రా చేసుకోవచ్చు.

హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ఏటీఎంల నుంచి నెలకు 10 సార్లు నగదును ఉపసంహరించుకోవచ్చు.

నాన్ మెట్రో నగరాల్లో 12 సార్లు విత్ డ్రా చేసుకోవచ్చు.

ఎప్పుడైనా చెక్ బౌన్స్ అయితే జీఎస్టీతో కలిపి రూ.168 ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది.

ఇతర బ్యాంకు కస్టమర్లు ఎస్‌బీఐ ఏటీఎంలలో నెలకు ఐదుసార్లు ఉచితంగా నగదు ఉపసంహరించుకోవచ్చు.

SBI నుంచి ఎస్ఎంఎస్ అలర్ట్స్ రావట్లేదా? ఇలా చేయండి

error: Content is protected !!