యూజీసీ నెట్ ఎగ్జామ్ డిసెంబర్ 2 నుంచి 6 మధ్య జరుగుతుంది.
సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ డిసెంబర్ 15న జరగనుంది.
అసిస్టెంట్ లెక్చరర్షిప్ లేదా జేఆర్ఎఫ్ మీ లక్ష్యమా? ఈ పోస్టులకు అర్హత కోసం యూజీసీ నెట్, సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ పరీక్షల్ని నిర్వహిస్తోంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA.
పీజీ పాసైనవారు చివరి సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆసక్తి గల అభ్యర్థులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 9న ముగుస్తుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్-JRF కోసం ప్రతీ ఏటా రెండుసార్లు యూజీసీ నెట్ నిర్వహిస్తోంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.
ఈ పరీక్ష పాసైనవారు అసిస్టెంట్ లెక్చర్షిప్ లేదా జేఆర్ఎఫ్ పోస్టులకు అర్హులు. కెమికల్ సైన్సెస్, ఎర్త్, అట్మాస్ఫెరిక్, ఓషియన్, ప్లానెటరీ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ రంగాలకు చెందిన విద్యార్థులు సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ రాయాల్సి ఉంటుంది.
సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ను మొదటిసారిగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుండటం విశేషం.
యూజీసీ నెట్ ఎగ్జామ్ డిసెంబర్ 2 నుంచి 6 మధ్య జరుగుతుంది. సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ డిసెంబర్ 15న జరగనుంది
ముఖ్యమైన తేదీలు..*
✦ *ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 09.09.2019*
యూజీసీ నెట్కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
పీజీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.*
*సరైన అర్హతలు కలిగిన అభ్యర్థులు సెప్టెంబరు 9 నుంచి అక్టోబరు 9 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అక్టోబరు 10 వరకు పీజు చెల్లించవచ్చు.
దరఖాస్తు ఫీజుగా జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.1000; ఓబీసీ అభ్యర్థులు రూ.500; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.
షెడ్యూలు ప్రకారం డిసెంబరు 2 నుంచి 6 వరకు యూజీసీ నెట్(డిసెంబరు)-2019 పరీక్షలు నిర్వహించనున్నారు.*
✦ *ఆన్లైన్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో మొత్తం 2 పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లకు కలిపి మూడు గంటల సమయం ఉంటుంది.
పేపర్-1కు గంట, పేపర్-2 కు రెండు గంటల సమయం ఉంటుంది.*
✦ *పేపర్-1 లో 100 మార్కులకుగాను 50 ప్రశ్నలు అడుగుతారు.
ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. టీచింగ్, రిసెర్చ్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి.*
✦ *ఇక పేపర్-2లో 200 మార్కులకుగాను 100 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. అభ్యర్థుల ఆప్షనల్ సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి.*
✦ *ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు.
మొదటి సెషన్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, రెండో సెషన్లో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.*