WARNING-Corona-with-currency-notes-Do-this-to-escape

WARNING-Corona-with-currency-notes-Do-this-to-escape

హెచ్చరిక: కరెన్సీ నోట్లతో కరోనా.. తప్పించుకోవాలంటే ఇలా చేయండి!

కరోనా వైరస్ ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు.

ఇప్పటికే దీని వల్ల వేల మంది మరణించారు.

మన దేశంలోనూ ఇది వేగంగా విస్తరిస్తూ వస్తోంది. అందువల్ల కొన్ని జాగ్రత్తలు ఫాలో కావాలి.

హైలైట్స్

కరెన్సీ నోట్ల వల్ల కూడా కరోనీ వ్యాప్తిచెందే అవకాశం

అందువల్ల వీటికి దూరంగా ఉండటం మంచిది

దీని కోసం డిజిటల్ బ్యాంకింగ్ ఛానల్స్ ఉపయోగించాలి

24 గంటలూ అందుబాటులో నెఫ్ట్, ఐఎంపీఎస్, యూపీఐ, బీబీపీఎస్ సేవలు

కరోనా వైరస్ దెబ్బకి ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి.

కోవిడ్ 19 శరవేగంగా విస్తరిస్తూ వస్తోంది.

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ బారినపడి మరణించిన వారి సంఖ్య 7,000కు పైగా చేరింది.

మన దేశంలోనూ కరోనీ చేరిన వారి సంఖ్య 125కు పెరిగింది. ఇప్పటి వరకు ముగ్గురు కరోనా వల్ల చనిపోయారు.

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కాంటాక్ట్‌లెస్ పేమెంట్ సిస్టమ్స్‌ను ఉపయోగించాలని ప్రజలను కోరుతోంది.

పేమెంట్ చెల్లింపుల కోసం నెఫ్ట్, ఐఎంపీఎస్, యూపీఐ, బీబీపీఎస్ వంటి విధానాలను ఉపయోగించాలని ఆర్‌బీఐ సూచిస్తోంది.

వీటి ద్వారా సులభంగానే చెల్లింపులు చేయొచ్చని, ట్రాన్సాక్షన్లకు పూర్తి భద్రత ఉంటుందని పేర్కొంది.

ఈ సేవలు రోజులో ఎప్పుడైనా అందుబాటులో ఉంటాయని తెలిపింది. మనీ ట్రాన్స్‌ఫర్, వస్తువులు/ప్రొడక్టుల కొనుగోలు, బిల్లు పేమెంట్స్ వంటి వాటికి ఈ నాన్ క్యాష్ డిజిటల్ పేమెంట్ ఆప్షన్‌ను ఉపయోగించొచ్చని పేర్కొంది.

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సోషల్ కాంటాక్ట్‌కు దూరంగా ఉండాలని, పబ్లిక్ ప్లేసులకు వెళ్లొద్దని ఆర్‌బీఐ సూచించింది. దీని కోసం ఇంటి వద్ద నుంచే మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, కార్డ్స్ వంటి వాటితో ఆన్‌ ఛానల్స్ ద్వారా డిజిటల్ పేమెంట్స్ నిర్వహించొచ్చని వివరించింది.

కరోనా వైరస్ ఉన్న ప్రాంతాన్ని తాకిన తర్వాత కళ్లు, నోరు, ముక్కు వంటి వాటిని తాకినప్పుడు కూడా వైరస్ సోకే ప్రమాదముందని నిపుణులు పేర్కొంటున్నారు.

అందువల్ల కరోనా వైరస్ వ్యాప్తి నుంచి తప్పించుకోవడానికి కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ కూడా ఎంతగానో ఉపయోగపడతాయని గుర్తించాలి.

ఇకపోతే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్‌ను NEFT అని పేర్కొంటారు.

ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్‌ను IMPS అని, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్‌ను UPI అని, భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్‌ను BBPS అని పిలుస్తారు.

ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి మరో బ్యాంక్ అకౌంట్‌కు రూ.2 లక్షలకు పైన డబ్బులు పంపాలంటే ఈ ఆప్షన్ ఉపయోగిస్తారు.

ఐఎంపీఎస్ ద్వారా రూ.2 లక్షల వరకు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు.

యూపీఐ ద్వారా క్షణాల్లో ఇతరులకు మనీ పంపొచ్చు.

కాగా కరెన్సీ నోట్లు, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందొచ్చని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పేర్కొంది.

మరోవైపు దేశీ అతిపెద్ద బ్యాంక్ ఎస్‌బీఐ కూడా కరోనా నేపథ్యంలో కస్టమర్లను అలర్ట్ చేస్తోంది. బ్యాంక్‌లో అకౌంట్ కలిగిన వారు SBI Yono యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోకపోతే ఇప్పటికైనా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని స్టేట్ బ్యాంక్ కోరింది.

ఈ యాప్ వల్ల బ్యాంక్ బ్రాంచ్‌కు రావాల్సిన అవసరం ఉండదని, సమయం ఆదా అవుతుందని తెలిపింది.

error: Content is protected !!