2019 – 20 విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే వినూత్న పద్ధతిలో ఆనంద వేదిక (హ్యాపీనెస్ కరిక్యులం) కార్యక్రమం అమలు చేస్తారు.
రోజూ పాఠశాల ప్రారంభం కాగానే మొదటి పీరియడ్లో 30 నిమిషాల పాటు ఆనంద వేదిక (హ్యాపీనెస్ కరిక్యులం)కు కేటాయించారు.
ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.10 గంటల వరకు, ఉన్నత పాఠశాలలను ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు నిర్వహిస్తారు. ఒంటిపూట బడులు ఉదయం 7.45 గంటల నుంచి 12.30 గంటల వరకు ఉంటాయి.
తరగతికి నిర్ధారించిన ప్రమాణాలు సాధించలేకపోవడంలో సిలబస్ ఒక ముఖ్య కారణమని భావించి సరైన ప్రమాణాలు సాధించడం కోసం సిలబస్ను తగ్గించారు. పాఠశాల పనిదినాలు 220 అయినప్పటికీ 160 పనిదినాలకనుగుణంగా సిలబస్ను తగ్గించారు.
ఈ విద్యా సంవత్సరంలో ఆనంద వేదికతోపాటు ‘శనివారం సందడి’, ‘రోజూ సవరణాత్మక బోధన’ అనే ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.
విద్యార్థుల్లో సృజనాత్మక నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ప్రతి నెలలో మొదటి, మూడో శనివారాల్లో ‘శనివారం సందడి’ పేరుతో ‘నో స్కూల్ బ్యాగ్ డే’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.