ప్రభుత్వ స్కూళ్లలో 2020-21 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టాలని పాఠశాల విద్య కమిషనర్ వాడ్రేవు చినవీర భద్రుడు ఆదేశాలు జారీ చేశారు.
ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదివిన, యూపీలో ఏడో తరగతి చదివిన విద్యార్థులను యూపీ లేదా హైస్కూళ్లలో చేర్చేందుకు తల్లిదండ్రుల సమ్మతి తీసుకుంటే సరిపోతుందన్నారు.
ఆరు, ఎనిమిది తరగతులలో చేరేందుకు విద్యార్థులు స్కూళ్లకు రావాల్సిన అవసరం లేదని, వారి తల్లిదండ్రుల నుంచి సమ్మతి పత్రం తీసుకుంటే సరిపోతుందన్నారు.
వరు ఏ స్కూల్ లో చేరాలను కుంటున్నారో ప్రధానోపాధ్యాయులు (హెచ్ఎం) తెలుసుకుని, ఆ వివరాలను సంబంధిత పాఠశాలల హెచ్ఎంలకు తెలపాలన్నారు.
ప్రక్రియను ప్రాథమిక స్కూళ్లలో ఎంఈఓ, హైస్కూళ్లలో డీవైఈఓ పర్యవేక్షించాలన్నారు.
వలస కూలీల పిల్లలకు ఎలాంటి పత్రాలు లేకున్నా అడ్మిషన్ ఇవ్వాలని ఆదేశించారు.
వారి నుంచి ఎలాంటి టీసీలను అడగవద్దన్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం హెచ్ఎంలు టీసీ, స్టడీ సర్టిఫికెట్లను అడగవద్దని స్పష్టం చేశారు.
ఛైల్డ్ ఇన్ఫోకు కొత్త వెబ్సైట్*
Note : LOGIN for below SERVICES Only.
1.New Student Entry 2.Edit Student 3.Transfer Certificate 4.Dropout 5.Dropout to Active 6.Aadhar Update 7.Student Active to Dropbox 8.New Child Insert No Aadhar No EID 9.Approve Schools
*పాఠశాలల్లో 1 నుంచి 5 వతరగతి వరకు చేరే విద్యార్థుల వివరాలను అప్డేట్ చేసే పాఠశాల విద్యాశాఖ కొత్త వెబ్సైట్ను అప్డేట్ చే సింది.*
*1వ తరగతిలో ప్రవేశించే విద్యార్థులు కోసం ప్ర త్యేకంగా రిజిస్ట్రేషన్ఫాం రూపొందించారు.
కొత్త విద్యార్థు ల వివరాలు ఎప్పటికప్పుడు చైల్డ్ఇన్ఫోలో పొందుపరచా లని పేర్కొన్నారు.*
*అదేవిధంగా హాస్టళ్లలో 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల అడ్మిషన్లను కొత్తవెబ్సైట్లో అప్డేట్ చేయయాలలని పాఠశాల విద్య కమిషనర్ చిన వీరభద్రుడు ఆదేశించారు.