అందుకే వీటిని డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్గా వ్యవహరిస్తారు.
సాధారణంగా కోర్సుల కాలవ్యవధి మూడేళ్లు.
కొన్నింటికి మూడున్నరేళ్లు. సెమిస్టర్ విధానంలో నిర్వహిస్తారు.
కోర్సుల కాలవ్యవధిని బట్టి ఆరు నెలల వరకు పారిశ్రామిక శిక్షణ ఉంటుంది.
కోర్సులు.. ప్రవేశం మనదేశంలో పాలిటెక్నిక్ కోర్సులకు పరిధి, గిరాకీ ఎక్కువ. ఎన్నో ఉత్తమ కళాశాలలు ఈ కోర్సులను అందిస్తున్నాయి.
పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలీసెట్) ద్వారా వీటిల్లోకి ప్రవేశాన్ని పొందవచ్చు.
పదో తరగతి లేదా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ గుర్తింపు పొందిన తత్సమాన కోర్సు (సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఎన్ఐఓఎస్, టీఓఎస్ఎస్, ఏపీఓఎస్ఎస్ వంటివి) పూర్తిచేసి ఉండాలి.
ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష విధానం
ఏపీ పాలీసెట్:
వ్యవధి రెండు గంటలు. ప్రశ్నపత్రం 120 మార్కులకు ఉంటుంది.
మేథమేటిక్స్ నుంచి 60, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో ప్రతి విభాగం నుంచి 30 చొప్పున ప్రశ్నలు వస్తాయి.
ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. రుణాత్మక మార్కులు లేవు.
ప్రత్యేకత ఏమిటి? * పాలిటెక్నిక్లో ‘చేయడం ద్వారా నేర్చుకోవడం’పై ప్రధాన దృష్టి ఉంటుంది.
అందులో భాగంగానే సాంకేతికాంశాలను థియరీ విధానంలో బోధించడంతోపాటు ప్రాక్టికల్ పరిజ్ఞానానికీ సమ ప్రాధాన్యం ఇస్తారు.
ఎలా సన్నద్ధమవ్వాలి? ప్రవేశపరీక్షలో అడిగే ప్రశ్నలన్నీ దాదాపుగా 9, 10 తరగతుల నుంచే వస్తాయి.
ముఖ్యంగా ప్రశ్నలన్నీ మేథ్స్, సైన్స్ సబ్జెక్టులకు చెందినవే.
పదో తరగతి తుది పరీక్షల తర్వాతే ఈ పరీక్ష ఉంటుంది.
విద్యార్థులు అప్పటికే సిలబస్ పూర్తి చేసి ఉంటారు.
కాబట్టి, ముందుగా ప్రవేశపరీక్ష సిలబస్ను సేకరించి పెట్టుకోవాలి.
తక్కువ వ్యవధి: వృత్తి విద్యా కోర్సులను పూర్తిచేసి త్వరగా ఉద్యోగంలో చేరాలనుకునేవారికి ఇవి అనుకూలం. ఉద్యోగం చేస్తూ ఉన్నతవిద్యను కొనసాగించవచ్చు.
లేదా లేటరల్ ఎంట్రీ ద్వారా ఇంజినీరింగ్ రెండో ఏడాదిలోకి నేరుగా ప్రవేశం పొందవచ్చు.
ప్రాక్టికల్ పరిజ్ఞానం: పాలిటెక్నిక్ కోర్సుల్లో థియరీ కంటే ప్రాక్టికల్ పరిజ్ఞానానికి ప్రాధాన్యం ఎక్కువ.
ఇంటర్మీడియట్ విద్యార్థితో పోలిస్తే పాలిటెక్నిక్ విద్యార్థి సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువ. ఫీజు తక్కువ: బీటెక్, బీఈ, ఇతర డిగ్రీ కోర్సుల కంటే ఈ కోర్సుల ఫీజు అందరికీ అందుబాటులో ఉంటుంది. విభాగం మార్చుకునే వీలు: పాలిటెక్నిక్ కోర్సుల్లో ఉన్న లాభదాయకమైన అంశమిది. కోర్సు పూర్తయ్యాక భవిష్యత్తులో చదువు కొనసాగించాలనుకుంటే రంగాన్ని మార్చుకునే వీలుంది.
కోర్సు పూర్తయ్యేనాటికి సంబంధిత సబ్జెక్టుల్లో అవగాహన, ప్రాక్టికల్ పరిజ్ఞానం పరంగా ఇతరుల కంటే ముందుంటారు. ఉద్యోగం/ వ్యాపారం: మూడేళ్ల డిప్లొమాను పూర్తిచేయడం ద్వారా సంబంధిత ఉద్యోగాలను అందుకోవచ్చు.
పీఎస్యూలు, ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో డిప్లొమా హోల్డర్లకు అవకాశాలుంటాయి.
వీరిని జూనియర్ స్థాయి, టెక్నీషియన్ హోదాల్లోకి తీసుకుంటారు.
రైల్వే, గెయిల్, ఓఎన్జీసీ, డీఆర్డీఓ, బెల్, ఎన్టీపీసీ మొదలైనవి వీరిని నియమించుకుంటున్నవాటిలో ప్రధానమైనవి. ప్రైవేటు ఎయిర్లైన్స్, కన్స్ట్రక్షన్, కమ్యూనికేషన్, ఆటోమొబైల్స్ సంస్థలూ వీరికి అవకాశాలు కల్పిస్తున్నాయి.
కోర్సులన్నీ ప్రాక్టికల్/ అప్లికేషన్ ఓరియెంటెడ్గా ఉంటాయి.
కాబట్టి తమ రంగంలో సొంతంగా వ్యాపారాన్నీ ప్రారంభించుకోవచ్చు.